Sunday, May 19, 2024
- Advertisement -

లేచిపోయేందుకు కట్నం అడిగిన ప్రియుడు….

- Advertisement -

ప్రేమించిన వారిని ద‌క్కించుకోవ‌డంకోసం అమ్మాయులు, అబ్బాయులు ఏపిని చేయ‌డానికైనా వెనుకాడ‌టంలేదు. చంప‌డానికైనా, చావ‌డానికైనా సిద్ధ‌ప‌డుతున్నారు. తాజాగా ప్రేమించిన ప్రియుడ్ని ద‌క్కించుకోవ‌డం కోసం ఓ అమ్మాయి ఎవ‌రూ చేయ‌ని ప‌నిచేయ‌డానికి సిద్ద‌మ‌య్యింది.

వివిరాల్లోకి వెల్తె ప్రియుడిని పెళ్లాడేందుకు కిడ్నీ అమ్మేందుకు బీహార్ యువతి సిద్ధపడడం దేశరాజధానిలో కలకలం రేపుతోంది. హార్ కు చెందిన యువతి (21)కి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. అయితే విభేదాల నేపథ్యంలో పుట్టింటికి చేరింది. ఈ క్రమంలో మరో యువకుడితో ప్రేమలో పడింది. అతనిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని పెద్దలకు చెప్పింది. కాని పెద్ద‌లు ఒప్పుకోలేదు. అయితె ప్రేమించిన వాడితో వెల్లి పోయోందుకు సిద్ద‌ప‌డింది.

అయితె ప్రియుడు మాత్రం కట్నం లేనిదే వివాహం కుదరదని తెగేసి చెప్పాడు. 1.8 లక్షల రూపాయల కట్నం కావాలని డిమాంండ్ చేశాడు. అతనితో వివాహానికే అంగీకరిచని తల్లిదండ్రులు కట్నం ఇచ్చే పరిస్థితి లేదు. తానే వారిపంచన బతుకుతోంది. తన దగ్గర కూడా పైసా లేదు. దీంతో ఆమ్మాయి బాగా ఆలోచించిన యువతి, కిడ్నీ అమ్మడం ద్వారా డబ్బులు సమకూర్చుకుని ప్రియుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది.

ఢిల్లీలోని ఓ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి వెళ్లి కిడ్నీ దానం చేయాల‌నుకుంటున్నాని చెప్పింది. ఆమె మీద డాక్ట‌ర్ల‌కు అనుమానం రావ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను విచారించిన పోలీసులు జరిగిన తతంగం మొత్తం తెలుసుకుని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రియుడిపై ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. అయితే కిడ్నీ అమ్మకాన్ని విరమించుకున్న ఆమె, ప్రియుడిపై ఫిర్యాదు చేసేందుకు మాత్రం నిరాకరించి, తిరిగి బీహార్ వెళ్లిపోయింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -