జియో వచ్చి ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జియో ఉచిత ఆఫర్స్ ఇస్తుండటంతో.. ఇతర కంపెనీలు కూడా రకరకల ఆఫర్లను ఇస్తోంది. ఆ క్రమంలో నే బీఎస్ఎన్ఎల్ కూడా రకరకల ఆఫర్స్ తో తమ వినియోగ దారులను కాపాడుకుంటుంది. అయితే ఈ సారి బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్స్ కు సూపర్ ఆఫర్ ప్రకటించింది.
ప్రీ పెయిడ్ వినియోగదారులకు ప్రతిభ పేరుతో ఓ ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ స్టూడెంట్స్ కు మాత్రమే వర్తిస్తోంది. ఈ ప్లాన్ లో ప్రధానంగా రూ.49లతో రీచార్జీ చేసుకుంటే.. 180 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా రూ.20 ఉచిత టాక్ టైమ్ కూడా వస్తోంది. దీంతో ఏ నెట్వర్క్కైనా వాయిస్ కాల్స్ నిమిషానికి 10పైసలు మాత్రనే చార్జ్ పడుతోంది.
బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్, మొబైల్ నెంబర్లకు కాల్ చేస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు. బీఎస్ఎన్ఎల్ టూ బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు ఫ్రీ. ఈ ప్లాన్లో 3GB ఉచిత డేటా, 300 ఉచిత SMSలు వస్తాయి అని తెలిపింది. అయితే ఈ విషయం పై మరిన్ని వివరాలకు 1503 టోల్ఫ్రీ నెంబర్ను సంప్రదించాలన్నారు.