Wednesday, May 22, 2024
- Advertisement -

మోడీని శిక్షిస్తాడు…. వెంకన్న విషయంలో బాబు చేసిన ఆ తప్పుకు శిక్షలేదా?

- Advertisement -

వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఆ తర్వాత హోదా ఇవ్వని మోడీని వెంకన్ననే శిక్షిస్తాడని బాబు ఊరూవాడా టముకు వేస్తున్నాడు. మోడీకి శిక్షపడాల్సిందే. మరి చంద్రబాబు చేసిన అంతకంటే పెద్ద తప్పుకు శిక్ష ఉండదా? అదే వెంకన్న సాక్షిగా చంద్రబాబు చేసిన అంతకంటే పెద్ద తప్పులకు శిక్షలు వేయడా ఆ వెంకటేశ్వరుడు? ఇప్పుడు ఈ విషయాలే ఆంధ్రప్రదేశ్ నాట హాట్ టాపిక్ అవుతున్నాయి. వెంకటేశ్వరస్వామిని కూడా తన రాజకీయాల కోసం వాడేసుకుని మోడీని కార్నర్ చేద్దామనుకుంటున్న బాబుకు దిమ్మతిరిగే షాకులు ఇస్తున్నాయి. బాబుతో సహా పచ్చ బ్యాచ్ మాటలన్నీ బూమరాంగ్ అయి 2019లో టిడిపినే నిలువునా ముంచేసేలా ఉన్నాయి.

వెంకన్నసాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ ప్రామిస్ చేశాడు. ఆ తర్వాత మోసం చేశాడు. అందుకు మోడీకి శిక్ష పడాల్సిందే. మరి అదే వెంకన్న సాక్షిగా అదే సభలో ప్రత్యేక హోదా సాధిస్తానని చంద్రబాబు కూడా ప్రామిస్ చేశాడుగా. ఐదేళ్ళు కాదు…….పదేళ్ళు కాదు….పదిహేనేళ్ళు తెస్తానన్నాడు. ఆ తర్వాత మాట మార్చి ప్యాకేజ్ బెస్ట్ అన్నాడు. హోదా వేస్ట్ అన్నాడు. మరి బాబు మోసానికి వెంకన్న శిక్షలు వెయ్యడా? ఇక రైతు రుణమాఫీలు, డ్వాక్రా రుణమాఫీలు, 2వేల నిరుద్యోగ భృతి…..ఇలా ఆరు వందల హామీలను కూడా అదే వెంకన్న సాక్షిగా చంద్రబాబు ఇచ్చాడు. అవేవీ చంద్రబాబు చెప్పినట్టుగా నెరవేరలేదు అన్నది కంటికి కనిపిస్తున్న నిజం.

నరేంద్రమోడీ, చంద్రబాబు హామీలను పోల్చి చూస్తే మోడీకంటే చంద్రబాబే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎక్కువ మోసం చేసినట్టుగా కనిపిస్తోంది. నాలుగేళ్ళ బాబు పాలనను పరిశీలిస్తే అర్థమయ్యే విషయం ఇదే. మరి మోడీని శిక్షించే ఆ వెంకటేశ్వరుడు బాబును శిక్షించడా? గుజరాతీ అయిన మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడు……..ఆంధ్రప్రదే్శ్ వాసి…..అందునా వెంకన్న కొలువై ఉన్న చిత్తూరు వాసి అయిన చంద్రబాబు స్వయంగా తను పుట్టిన రాష్ట్రానికి, తన రాష్ట్ర ప్రజలనే మోసం చేశాడే……మరి వెంకన్న సాక్షిగా మోడీ చేసిన మోసానికే శిక్షలు పడితే…….చంద్రబాబుకు ఇంకేస్థాయిలో శిక్షలు పడాలి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -