Thursday, May 16, 2024
- Advertisement -

రాజకీయంలో పవన్ కన్నా.. చిరంజీవే కొంచెం బెటర్ ఏమో..!

- Advertisement -

చిరంజీవిదే రాజకీయంగా ఫెయిల్యూర్ స్టోరీ. పార్టీని ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి పదవిని లక్ష్యంగా చేసుకొని దాన్ని సాధించడంలో ఘోరంగా విఫలం అయ్యాడు.

మరి ఆ పార్టీని అయినా సరిగ్గా నిలిపాడా? అని అంటే అదీ లేదు. రాజ్యసభ సీటు కోసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలున్న పార్టీని విలీన బాటపట్టించాడు. ఆ తర్వాత పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండలేకపోయాడు. తిరిగి సినిమాల వైపు వచ్చేసే ప్రయత్నంలో ఉన్నాడు.

మరి ఇంత దారుణంగా ఉన్నా.. మెగాస్టారే పవర్ స్టార్ కన్నా బెటర్ అనిపిస్తున్నాడు. రాజకీయాల్లో పవన్ కన్నా మేలనిపిస్తున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రత్యేక హోదా అంశంలో పవన్ చేతులు ఎత్తేశాడు. తను ఇప్పుడు ప్రశ్నించలేనని ఆయన అంటున్నాడు. ఒకవైపు ప్రత్యేక హోదా అంశం గురించి ఆత్మహత్యలే జరిగిపోతున్నా.. పవన్ మాత్రం సరిగ్గా స్పందించలేదు. 

మరణించిన ముని కోటి నివాళి ఘటించడం తప్ప ఇప్పుడు తను ఇంకేం చేయలేనని.. ప్రశ్నించలేనని స్పష్టం చేశాడు పవర్ స్టార్. అయితే ఇదే సమయంలో చిరంజీవి భారతీయ జనతా పార్టీ పై విరుచుకుపడ్డాడు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాయని.. ప్రత్యేక హోదా విషయంలో తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నాయని చిరంజీవి ధ్వజమెత్తాడు. మరి ఈ తీరును గమనిస్తుంటే.. పవన్ కన్నా చిరంజీవే గట్టి గా స్పందించాడేమో అనిపిస్తుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -