శరీరంలో వాతం పెరిగితే నిద్ర పట్టక పోవచ్చు. మీరు దేశవాళీ ఆవు నెయ్యిని పడుకునే ముందు రెండు చుక్కలు రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుని పడుకోండి. మంచి నిద్ర పడుతుంది. గురక తగ్గుతుంది , కలలురావు , పిల్లలకు ఇలా చేస్తే మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
అధిక రక్తపోటు గురించి …..
రక్తంలో ఆమ్లాలు పెరిగితే రక్తపోటు వస్తుంది. మీరు క్షార పదార్ధమైన మెంతులు , క్యారెట్ , ఇంకా ఆపిల్ , జామపండు , అరటికా , ఇలా రసంలేని పండ్లలో క్షారగుణం వుంటుంది. ఇవి తీసుకోవాలి. ఆకుకూరల్లో పాలకూర , బంగాళదుంప క్షారము కాదు. ఆమ్లముకాదు. ఇది మధ్య స్ధితి కలిగినది. ఇలా క్షారగుణం కలిగిన పదార్ధాలను తీసుకుంటే మీ బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. స్ధూలకాయం తగ్గుతుంది. సొరకాయ లో ఎక్కువ క్షారగుణం ఉన్నది. దీనిని పచ్చిగా కూడా తీసుకోవచ్చును , రసం త్రాగవచ్చును. ఇది చాలా మంచిది.
ఆస్తమా గురించి …….
ఆస్తమా , ఇది వాయు ప్రకోపంవల్ల వచ్చేది. దీనికి దాల్చిన చెక్కను తేనెతో కలిపి తీసుకోవాలి. రసం ఉండికూడా క్షారగుణం కలిగిన ఒకే ఒక కాయ కొబ్బరి కాయ. ఆస్తమా + ఉబ్బసం ఉన్న వారు క్రమం తప్పకుండా పచ్చి కొబ్బరి కాయను తినండి. పచ్చి కొబ్బరిని రోజు 50 గ్రాముల వరకు బాగా నమిలి నమిలి తినాలి. ఇలా తింటే 3 నెలల్లో మీ ఆస్తమా + ఉబ్బసం తగ్గి పోతాయి.
నోటిలో బొబ్బలు…….
నోటిలో బొబ్బలు మీ కడుపులో మలినాలు ఉంటే వస్తాయి. దీనికి ఉదయాన్నే నీళ్ళు సిప్ సిప్ చేసి త్రాగుతుంటే తగ్గిపోతాయి.
” ఆరోగ్యమే …..మహాభాగ్యం. ”