Thursday, May 9, 2024
- Advertisement -

విద్యార్థినికి బాత్రూంలోనే అబార్ష‌న్.. కారకులు ఎవరు..?

- Advertisement -

ఓ దారుణ సంఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలిక‌ల వ‌స‌తి.. బయట.. అప్పుడే పుట్టిన ఓ పసికందు శవమై కనిపించింది. అసలు ఆ పసికందు.. అల ప్రభుత్వ బాలిక‌ల వ‌స‌తి వెనక ఎవరు వేశారో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఆ ప్ర‌భుత్వ బాలిక‌ల హాస్ట‌ల్లోని ఓ విద్యార్థిని.. గ‌ర్భం దాల్చ‌డంతో.. హాస్టల్ అధికారులు.. సిబ్బంది.. గుట్టు చప్పుడు కాకుండా.. ఆ విద్యార్థినికి అబార్ష‌న్ చేయించాల‌ని ప్లాన్ వేశారు. ఇక ఆ విద్యార్థినికి.. ఏడు మాసాలు నిండ‌టంతో.. ఎవరికి తెలియకుండా.. హాస్ట‌ల్ బాత్రూంలోనే అబార్ష‌న్ చేయించినట్లు సమాచారం. అప్పుడే బయటకు వచ్చిన ఆ ప‌సిబిడ్డ‌ను ప‌క్క‌నే ఉన్న గోడ వెన‌కాల‌కు ప‌డేశారు. ప‌సికందును ప‌డేస్తుంటే చూసిన ఓ వ్యక్తి.. పోలీసుల‌కు,మీడియాకు విషయం చెప్పడంతో.. అసలు విషయం గుట్టూ రట్టైంది. రంగంలో దిగిన ప్రభుత్వం.. ఈ ఘ‌ట‌న‌పై చాలా సీరియస్ అయింది.

వెంట‌నే హాస్ట‌ల్ సంక్షేమాధికారి విజ‌య‌నిర్మ‌ల‌ను స‌స్పెండ్ చేశారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ స‌హాయాధికారి శ‌శిభూష‌ణ్ ను కూడా స‌స్పెండ్ చేయాల‌ని ఉన్న‌తాధికారుల‌కు సిఫార్సు చేశారు. అయితే ఆ విద్యార్థిని గ‌ర్భం దాల్చ‌డానికి కారకులు ఎవరో.. ఎందుకు అంత ర‌హ‌స్యంగా ఇన్నాళ్లు బయటపడకుండా ఉంచారు. అనే కోణంలో పోలీసులు దర్శప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -