Friday, April 26, 2024
- Advertisement -

కంటికి కనిపించే ‌వైఎస్‌ల మానవత్వాన్ని చూడలేరా? లేని ఫ్యాక్షన్ ముద్ర వేస్తారా?

- Advertisement -

రాయలసీమ రౌడీలు, పులివెందుల గూండాలు అంటూ ఇప్పటికే బాబు, లోకేష్‌లు సీమ ప్రజలను అవమానిస్తూ చాలా సార్లు మాట్లాడారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే మాటలతో ప్రజల ముందుకొచ్చాడు. రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడికి కూడా ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. వైఎస్‌ల ప్రజాదరణను తట్టుకోలేక ఇలాంటి కుత్సిత రాజకీయాలకు పాల్పడతారో……….లేక ఆత్మవంచన చేసుకుని మాట్లాడుతున్నారో తెలియదు కానీ నాయకులందరూ కూడా వైఎస్‌లను చెడు చేయడానికి రాయలసీమ ప్రజలందరినీ అవమానిస్తున్నారన్నది మాత్రం కంటికి కనిపిస్తున్న నిజం.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందరికీ గుర్తుండేలా చిరంజీవి చూపించిన హీరోయిజం కడప జిల్లాలో మీసం మెలేయడం, తొడగొట్టడమే. ఎవరికి ఏం సందేశం ఇవ్వాలని చిరంజీవి అలా చేశాడో తెలియదు. కానీ వైఎస్సార్ మాత్రం చిరంజీవికి తొడలు కొట్టడం వచ్చేమో నాకు మాత్రం ప్రేమ పంచడం తెలుసు……..అందుకే నా తండ్రిని చంపినవారిని చంద్రబాబు పదవులతో గౌరవిస్తున్నా ఏమీ మాట్లాడడం లేదు అని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా పవన్ కూడా జగన్‌ని ఏదో చేస్తానని బెదిరిస్తూ రాయలసీమ వాసులందరూ కత్తులతో, గొడ్డల్లతో తిరుగుతూ ఉంటారు అనేలా మాట్లాడేశారు. రీసెంట్‌గా ఆయన మిత్రుడు త్రివిక్రమ్ కూడా సీమవాసుల చంపడానికో, చావడానికో బ్రతుకుతూ ఉంటారు అనేలా మాటలు రాశారు. ఇక ఇప్పుడు పవన్ కూడా గోదావరి జిల్లాల వాసులు గొప్పవాళ్ళు……….సీమవాసులు రక్తం తాగేవాళ్ళు అనే స్థాయిలో పోలుస్తూ మాట్లాడేశారు.

చంద్రబాబు, లోకేష్, పవన్‌……..వీళ్ళకు తెరవెనుక ఉండి మద్దతిచ్చేవాళ్ళందరూ కూడా కేవలం వైఎస్‌లను తక్కువ చేయడానికే ఈ రకమైన మాటలు మాట్లాడుతారన్నది నిజం. ఇక రాయలసీమపై కనీస స్థాయిలో కూడా ప్రేమ లేకపోవడం మరో కారణం. రాయలసీమ వాసుల ఓట్లు ఎలాగూ వైఎస్‌లకు పడతాయి కాబట్టి ఇతర ప్రాంతాల ఓట్లను ఆకట్టుకోవడం కోసం కూడా రాయలసీమను తగ్గించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ నాయకులందరికీ వైఎస్‌ల ప్రేమ, అభిమానాలు మాత్రం కనిపించవు. మానవత్వం కనిపించదు. రూపాయికి సర్వీస్ చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సేవను గుర్తించలేరు. ఇక ఇప్పుడు కూడా ఎక్కడ విపత్తు వచ్చినా అందరికంటే ఎక్కువగా డొనేషన్స్ ఇస్తున్న నాయకుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ జగన్ కాదా? తాజాగా శ్రీకాకుళం బాధితులకు కూడా కోటి రూపాయలు డొనేట్ చేశాడు జగన్. మరి అదే స్థాయిలో చంద్రబాబు, లోకేష్……ఇంకా టిడిపికి మద్దతు పలికే పారిశ్రామికవేత్తలు ఇవ్వగలరా? ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వ సొమ్ము ఖర్చుపెట్టేస్తారు. అందులో కూడా వాటాలు, పర్సంటేజీలు కొట్టేస్తున్న నిజాలను కళ్ళతో చూస్తున్నాం. ఇక డొనేషన్స్ విషయంలో మెగా ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. చిరంజీవి, అల్లు అరవింద్‌ల పిసినారితనం గురించి సినిమా ఇండస్ట్రీ జనాలు, చిరంజీవి పుట్టిన ఊరి ప్రజలు కథలుకథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు అసలు సొంతంగా హాస్పిటల్ కట్టించి డాక్టర్‌గా ఉచితంగా ప్రజలకు సేవ చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని, ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ, ఆ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరికంటే ఎక్కువగా డొనేషన్స్ ఇస్తున్న వైఎస్ జగన్‌ని విమర్శించే అర్హత ఉందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -