జియో వచ్చి.. ఎంతో మందికి ఉచిత డేటా అందించింది. దాంతో జియో వినియోగదారులు జోరుగా పెరిగిపోయారు. అయితే ఇప్పుడు జియో.. 4జీ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇటివలే జియో 4జీ ను 1500 రూపాయలు కట్టి.. ఫోన్ తీసుకున్న తర్వాత.. తిరిగి 1500 మూడు సంవత్సరాల తర్వాత ఇచ్చేస్తారు. అయితే జియో ఫోన్ లో వాట్సాప్ ఉండేలా సాఫ్ట్ వేర్ డెవలప్ చేయాలని కంపెనీలను ఆదేశించింది.
రెగ్యులర్ వాట్సాప్ యాప్ కాకుండా.. త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న వాట్సాప్ లైట్ (LITE)ను జియో ఫోన్ లో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జియో కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై జియో అధికారిక ప్రకటన చేయనప్పటికీ, జియో ఫోన్లో వాట్సాప్ కొత్త వెర్షన్ను ఉంటుందని.. ఈ మేరకు జియో వాట్సాప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టెలికాం విశ్లేషకులు అంటున్నారు. జియోఫోన్ కోసం వాట్సాప్ కొత్త వర్షన్ను అభివృద్ధి చేస్తున్నారని, దీనిలో పలు రకాల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు ఫ్యాక్టర్ డైలీ అనే వెబ్సైట్ వెల్లడించింది.
మొత్తానికి జియో పెద్ద ప్లాన్ చేసింది. ఇప్పటికే తక్కువ టారిఫ్ ప్లాన్లతో అపరిమిత వాయిస్ కాల్స్, డేటాను అందిస్తోన్న ఈ కంపెనీ.. ఇప్పుడు 4జీ VOELTE ఫీచర్ ఫోన్తో గ్రామీణ ప్రాంతాల మొబైల్ యూజర్లను టార్గెట్ చేసింది. జియో ఫోన్ లో వాట్సాప్ ఉంటే మాత్రం తిరుగు ఉండదని అంటున్నారు.