Sunday, May 19, 2024
- Advertisement -

హైద‌రాబాద్‌లోని కరపత్రాలు సంచ‌ల‌నం రేపాయి!

- Advertisement -
my husband did not have anyone to spend with me

హైద‌రాబాద్‌లోని నిజాంపేట‌లో ముద్రించిన కరపత్రాలు సంచ‌ల‌నం రేపాయి. ‘నేను భర్త తోడు లేకుండా ఒంటరిగా ఉన్నాను, ఎవరైనా నాతో గడపాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు అంటూ ఫోన్‌నెంబరుతో సహా కరపత్రాలు ముద్రించారు. అదేంటి ఆమె భ‌ర్త లేక‌పోవ‌డం ఏంటి…? ఆమె త‌న‌తో ఎవ‌రైనా వ‌స్తారా ? అని క‌ర‌ప‌త్రాలు ముద్రించి మ‌రి విడుదల చేయ‌డం ఏంట‌ని ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. అయితే దీని వెనక ఉన్న అసలు నిజాన్ని పోలీసులు పట్టుకున్నారు.

నిజాంపేటలో ఉంటున్న ఓ మహిళ భర్త ఉండగానే మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. ఇదిలా ఉండగా నాలుగు నెలల క్రితం మహిళ భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. భర్త మృతిచెందాక…  మహిళ సన్నిహితంగా ఉన్న వ్యక్తిని అలక్ష్యం చేయడంతో ఆగ్రహంతో అతడు జీడిమెట్లలోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో మహిళపై అసభ్యమైన పదజాలంతో కరపత్రం ప్రిటింగ్‌ చేయించాడు.

నా భ‌ర్త‌లేడు…నేను ఒంట‌రిగా ఉంటున్నాను..నాతో ఎవ‌రైనా గ‌డ‌ప‌డానికి వ‌స్తారా ? అని ఆమె అడ్ర‌స్‌, ఫోన్ నెంబ‌ర్‌తో స‌హా ముద్రించి ఉన్న 500 కరపత్రాలను మహిళ నివాసముండే ప్రాంతంలో పంపిణీ చేశాడు. కరపత్రాలను చూసిన ఇరుగు పొరుగు వారు ఈ విషయాన్ని సదరు మహిళకు తెలుపడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ మహిళ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే.. కేసు దర్యాప్తు చేపట్టి నిందితున్ని పట్టుకొని అసలు నిజాన్ని రాబట్టారు. నిందితుడిపైనా, ఈ క‌ర‌ప‌త్రాలు ముద్రించిన‌ ప్రిటింగ్‌ప్రెస్‌ నిర్వాహ కుడిపైనా కేసు నమోదు చేశారు.

Related

  1. శృతీహాసన్ ను బూతు మెసేజ్‌ల‌తో వేదించిన డాక్ట‌ర్‌
  2. సెక్స్ మీద కోరిక‌తో న‌ర‌కం చూపించాడు!
  3. అలాంటి వారితో ఆడాళ్లుకు సెక్స్ అంటే ఇష్టమట!
  4. అందాల విందుకు నేను రెడీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -