Monday, April 29, 2024
- Advertisement -

మూవీస్ లో ఛాన్స్ ఇస్తానని.. అతను ఏం చేశాడంటే..?

- Advertisement -

సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని చెప్పి.. ఓ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఓ అమ్మాయిని నమ్మించి మోసం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగింది. పూర్తి విషయంలోకి వెళ్తే.. 24 ఏళ్ల యువతి ఓ ప్రైవేట్ ఆస్పత్రి సాఫ్ట్ నర్సుగా పనిచేస్తోంది. ఆమె తమ్ముడి ద్వారా లోక్‌నాథ్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడింది. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఆ యువతిని తన తల్లి విజయలక్ష్మి వద్దకు లోక్‌నాథ్ తీసుకువెళ్లి పరిచయం చేశాడు.

ఈ నెపథ్యంలో ఓ షార్ట్ ఫిల్మ్ లో అవకాశం కల్పించడమే కాకుండా.. మూడువేల రూపాయల పారితోషికం ఇచ్చాడు. దీంతో ఆ నర్సుకు నమ్మకం బాగా పెరిగింది. ఈ నెపథ్యంలో ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించేందుకూ ఆ యువతి అంగీకరించింది. ఆ యువతితో ఓ తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్న విజయలక్ష్మి.. యూనిట్ సభ్యులతో ఆమెను షూటింగ్‌కు పంపింది. ఆపై గుర్తు తెలియని ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్లి వారు అసభ్యంగా ప్రవర్తించారు. వెంటనే విజయలక్ష్మికి ఫోన్ చేసిన బాధితురాలు చెప్పగా.. వాళ్లు ఎలా చెబితే అలా చెయ్యమని.. లేకుంటే వేరే కేసులో ఇరికిస్తానని విజయలక్ష్మి బెదిరించింది.

గత్యంతరం లేని పరిస్థితుల్లో యూనిట్ సభ్యులు చిత్రీకరించిన పది అశ్లీల షార్ట్ ఫిల్మ్స్‌లో ఆ యువతి నటించాల్సి వచ్చింది. దర్శకుడు దుర్గారావు అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని తన పరువు పోతుందనే భయంతో ఈ విషయాన్ని దాచేసింది. ఆన్ లైన్‌లో ఆ షార్ట్ ఫిల్మ్స్ ఇటీవల పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -