తెరాస ఉద్యమ పార్టీగా ఉన్న టైం లో సెలెబ్రిటీ లు అందరూ టచ్ మీ నాట్ అన్న రీతి లో వ్యవహరించే వారు. అంతకు మించి ఒకరితో ఒకరికి సంబంధాలే ఉండేవి కాదు.
ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఉద్యమ నాయకుడు కెసిఆర్ సైతం రాజకీయ నేతలతో పాటు భారీగా సెలేబ్రిటీలు పారిశ్రామిక వేత్తల తో సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. ఆయన కొడుకు, తెలంగాణా మంత్రి కేటీఆర్ కి కూడా సెలెబ్రిటీ లతో స్నేహ సంబంధాలు మెండు. ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఒకే ఏజ్ గ్రూప్ అయినా ఎవ్వరూ ఎవ్వరితూ అసలు మాట్లాడుకునే వారు కూడా కాదు. సిటీలో నిర్వహిస్తున్న10కే రన్ లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ వచ్చారు.
ఆయన వచ్చారంటే.. ఆయనకు దోస్తులుగా ఉన్న సెలబ్రిటీలు రాకుండా ఉండేవారా? మెగా హీరో రామ్ చరణ్.. రాశీఖన్నా.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఇలా ప్రముఖులు చాలామందే వచ్చారు. అన్నింటి కంటే.. కేటీఆర్ తో సానియా.. రాంచరణ్.. రాశీ ఖన్నాదిగిన సెల్ఫీ అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు.. కార్యక్రమం ముగిసినతర్వాత.. కేటీఆర్ కారులో రాం చరణ్.. సానియా.. రాశీఖన్నాలు వెళ్లటం కనిపించింది. తెలంగాణ రాజకీయాల్ని.. టీఆర్ఎస్ పార్టీని చూసే జర్నలిస్టులు చాలామంది.. ఈ సీన్ చూసినప్పుడు.. పవర్ ఎంత ‘పవర్ ఫుల్’ అన్న మదిలో మెదిలేలా చేసింది.