ఉచిత ఆఫర్లతో టెలికాం రంగంలో సంచలనానికి తెరతీసింది రిలయన్స్ జియో. ఈ క్రమంలోనే జియో పోటీని తట్టుకునేలా ఇతర కంపినీలు ఎంత ప్రయత్నించిన జియోని అందుకోలేకపోతున్నాయి. ఉచిత కాల్స్, ఉచితంగా మొబైల్ డేటా… వాడుకున్నోళ్లకు వాడుకున్నంత ఇచేసింది జియో.
ఇక జియో ఆఫర్ స్టార్ట్ చేసిన 83 రోజుల్లోనే 5.2 కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకోవడం విశేషం. అయితే ఇప్పుడు రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకు 4 జి ఫోన్లలో పని చేసే జియో సిమ్ ఇకపై 2 జి, 3 జి ఫోన్లలో కూడా పనిచేస్తుంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఇప్పటికీ 2జీ,3జీ ఫోన్లనే వాడుతున్నారు. దీంతో వారిని ఆకర్షించేందుకు జియో ఈ నిర్ణయం తీసుకుంది. 2జీ, 3జీ ఫోన్లలో జియో ఎలా పనిచేస్తుందనే సందేహం చాలా మందికి కలగొచ్చు.
దానికి సంబంధించిన వివరాలను కూడా జియో చెప్పుకొచ్చింది. సిమ్ తీసుకున్న తర్వాత జియోఫై అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోండి. ఆ తర్వాత జియో4జీవాయిస్ అప్లికేషన్ ను మీ 2జీ, 3జీ స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి. కొన్ని గంటల్లో సిమ్ యాక్టివేట్ కాగానే జియో ఫ్రీ వాయిస్ కాల్ సేవలు, డేటా సేవలను పొందవచ్చు.
Related