రిలయన్స్ జియో యూజర్లకు వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంది. జియో ఇచ్చిన దెబ్బతో ఇతర కంపెనీలు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. డిసెంబర్ తో జియో వెల్ కం ఆఫర్ గడువు అయిపోతుడటంతో.. మరో అదిరిపోయే ఆఫర్ ప్రకటించనుంది. డిసెంబర్ 28న ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా వెల్ కం ఆఫర్ గడువు ఏకంగా ఏడాది పాటు పొడిగించనున్నారట. అయితే జియోని దెబ్బ కొట్టడానికి ఇప్పుడు బి ఎస్ ఎన్ ఎల్ రెడీ అవుతోంది.
బి ఎస్ ఎన్ ఎల్ సరికొత్త బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసింది. 2017 జనవరి నుంచి ఉచిత కాలింగ్ పధకాన్ని ప్రవేశపెడుతుందని సమాచారం. ఇది కేవలం 4 జి ఫోన్లకే కాకుండా 3 జి 2 జి ఫోన్లకు కూడా ఉపయోగపడుతుందని చైర్మన్ అండ్ ఎండి అనుపమ్ తెలిపారు. అంతేకాకుండా జియో ఇచ్చే ఆఫర్స్ కన్న అతి తక్కువ ధరకే.. ఇంటర్నెట్ అందిస్తామని తెలిపారు.
కేవలం రూ 2 లేదా రూ 4 లకు ఇంటర్నెట్ ప్లాన్స్ ప్రవేశ పెడతామని అన్నారు అనుపమ్. జియో ప్లాన్స్ ముఖేష్ అంబానీ ప్రకటించిన తరువాత దానికి దీటుగా మొదటిసారి సరికొత్త ప్లాన్ తీసుకువచ్చిన నెట్ వర్క్ బి ఎస్ ఎన్ ఎల్. అయితే కొత్త ప్లాన్ మొబైల్ వినియోగదారులకు కాకుండా బ్రాడ్ బాండ్ వినియోగదారులకు ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఫ్రీ కాల్స్ అనేది బ్రాడ్ బ్యాండ్ నుండి కనెక్ట్ అవనున్నట్లు అంచనా.
Related