భారత్ ఆర్మీ మరో కీలక నిర్నయం తీసుకుంది. సైన్యంలో రోబో సైనికులను ప్రవేశ పెట్టేందుకు ముందడుగు వేసింది.దీనికి సంబందించి రక్షణ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది.ఆర్మీలో రోబో సైనికులు మరిన్ని సేవలు అందించనున్నాయని అధికారులు తెలిపారు.
జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు, అల్లరి మూకల రాళ్ల దాడులను ఎదుర్కోవడంలో సైన్యానికి ఈ రోబోలు సహకరించబోతున్నాయి. ముష్కరమూకల విధ్వంసాలను అదుపు చేసే సమయంలో సైనికులకు ఎదురవుతున్న కష్టాలను తగ్గించేందుకు సైన్యం ఈ రోబోటిక్ వెపన్స్ ను వాడనుంది.
ప్రస్తుతం ఆర్మీకి అవసరమైన 544 రోబోలు అవసరమంటూ సైనికాధికారులు పంపిన ప్రతిపాదనకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. డీఆర్డీవో గత ఎనిమిది నెలలుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది.విభిన్నమైనటువంటి వాతావరణ, ప్రాదేశిక పరిస్థితుల్లో పని చేస్తున్న సైనికులకు దీటుగా ఈ రోబోలను రూపొందించారు. పలు కీలక స్థావరాల వద్ద వీటిని మోహరింపజేయనున్నారు.