Monday, April 29, 2024
- Advertisement -

కలలో ఇవి కనిపిస్తే.. త్వరలోనే ధనవంతులు అవుతారని అర్ధమట!!

- Advertisement -

ప్రతి ఒక్కరికి కలలు రావడం సహజం. వాటిలో కొన్ని కలలు మంచివిగా మరి కొన్ని చెడ్డవిగా వస్తుంటాయి. కొంతమంది వీటిని కేవలం భ్రమలుగా కొట్టిపారేస్తుంటారు. అయితే తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయని మన పెద్దలు చెబుతుంటారు. అందులోనూ తెల్లవారు జామున వచ్చే కలల్లో కొన్ని వస్తువులు కన్పించాయంటే త్వరలోనే డబ్బులు చేతికి అందుతాయని పండితులు కూడా చెబుతున్నారు.

Also Read: ఆర్థిక సమస్యలు పోవాలంటే ఇలా చేయండి !

కొన్ని కలలు వెనక ముఖ్యమైన కారణాలుంటాయి. రహస్యాలు కూడా ఉంటాయి. వస్తువులు, బంధువులు, జంతువులు ఇలా కలలో ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు కలలో దర్శనం ఇస్తే దాని వెనుక సంకేతాలు ఉంటాయి. కలలో కనిపించేవన్నీ భ్రమ అనేది ఎంత నిజమో ఆ రకమైన హేతువును మన మెదడు ఊహిస్తోంది అనేది కూడా అంతే నిజం. కానీ మనకు కలలు వస్తున్నాయంటే భవిష్యత్‌లో జరగబోయే వాటికి ఆనవాళ్లని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, కొన్ని రకాల కలలు కంటే తొందరలోనే ధనవంతులు అవుతారని భవిష్య పురాణం చెబుతోంది. మరి మిమ్మలన్ని ధనవంతుల్ని చేసే ఆ కలల గురించి తెలుసుకుందాం.

Also Read: రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఇలా చేయకండి..!

కలలో ఉదయిస్తున్న సూర్యుడు గానీ, పున్నమి చంద్రుడు కానీ కనిపిస్తే త్వరలోనే డబ్బులు చేతికి అందుతాయని అర్దం. అలాగే తెల్లవారు జామున వచ్చే కలలో మనుషుల మలం అంటే లెట్రిన్ కన్పిస్తే వెంటనే అంటే అదే రోజు గానీ మరుసటి రోజు గానీ డబ్బులు ఖచ్చితంగా చేతికి అందుతాయని పండితులు చెబుతున్నారు. జుట్టు రాలుతున్నట్టు, ఆవు పాలు ఇస్తున్నట్టు, బంగారం ధరించినట్టు, పాయసం తింటున్నట్లుగా కానీ వండుతున్నట్లుగా కానీ, చక్కటి అద్దాలు కలలో కనిపిస్తే వారికి త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట.

Also Read: పుట్టిన తేదీని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోండి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -