క్యాబినెట్ భేటీ నిర్ణయాలు ఇవే :
– రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఈనెల 18 న ఆహ్వానించాలని నిర్ణయించారు.
– పోలవరం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం.
– రాజధాని నిర్మాణం విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్ నోటిస్ తో వచ్చిన ఇబ్బందేమీ లేదు.
– స్పష్టమైన వివరాలతో అధికారులు నివేదిక సిద్ధం చేసి ట్రిబ్యునల్కు సమర్పించాలి.
– శంఖుస్థాపన ఘనంగా విజయవంతంగా జరిగేలా చూడాలి.
-వీఐపీల ఏర్పాట్లకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించాలి. ఈ బాధ్యతలను మంత్రులే తీసుకోవాలి.
– తెలంగాణ మంత్రులు నేతలకు కూడా ఆహ్వానాలు అందించేందుకు కేబినెట్ అంగీకారం.
– రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మారుస్తూ క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
– శంఖుస్థాపనకు ప్రతిపక్ష నేత నుంచి గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లందరికీ ఆహ్వానాలు పంపించాలనే నిర్ణయం తీసుకున్నారు.
