టెలికామ్ రంగంలో జియో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జియో రావడం వల్ల.. ఇతర టెలికం కంపెనీలు కూడా కిందకు దిగి వచ్చాయి. జియో ఇస్తున్న ఆఫర్లు చూసి.. ఎక్కువమంది జియో వాడటం మొదలు పెట్టారు. దాంతో తమ యూజర్లను కాపాడుకునేందుకు ఇతర టెలికం కంపెనీలు ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నాయి.
జియో రాకముందు ఇంటర్నెట్ వాడాలంటేనే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అతి తక్కువ ధరలకే అన్ని టెలికం కంపెనీలు ఆఫర్స్ ఇస్తున్నాయి. ఈ క్రమంలో వొడాఫోన్ నెటవర్క్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేవలం రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే తమ ప్రీపెయిడ్ వినియోగదారులు 90జీబీ 4జీ డేటాను ఆరు నెలల కాల వ్యవధితో పొందవచ్చని పేర్కొంది. అంతేకాదు.. అన్లిమిటెడ్ లోకల్కాల్స్, ఎస్టీడీ కాల్స్ కూడా ఉచితంగా చేసుకోవచ్చని తెలిపింది.
ఈ ఆఫర్ ను పరిశీలించి చూస్తే.. రూ.4.43కే 1జీబీ వస్తున్నట్లు లెక్క అని పేర్కొంది. టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో ఇస్తోన్న పోటీతో ఇతర కంపెనీలు కూడా పోటాపోటీగా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇలాంటి ఆఫర్ను ఇతర టెలికం కంపెనీలు మూడు నెలల కాల వ్యవధితోనే అందిస్తున్న విషయం తెలిసిందే. అదే దారిలో వొడాఫోన్ కూడా ఈ ఆఫను ప్రకటించింది.