ఎంతో సంతోషంగా ప్రారంభించే న్యూ ఇయర్ ఇంకో నాలుగు రోజుల్లో రానుంది. సంవత్సరమంతా హ్యాపీగా ఉండాలని, అంతా మంచి జరగాలని అందరూ కోరుకుంటారు. అయితే 2017 జనవరి 27 రానున్న అమావాస్య చాలా భయంకరమైనదని, ఆ అమావాస్యను మౌని అమావాస్య అంటారని జ్యోతిష్కులు చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం వచ్చే అమావాస్యలా కాకుండా ఇది చాలా సమస్యలతో కూడుకుందని అంటున్నారు. ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మౌనంగా ఉండాలని సూచించారు. అంతేసేపు మాట్లాడకుండా ఉండలేని వారు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకైనా తప్పకుండా మౌనంగా ఉండాలని అంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఆ సమయంలో మాట్లాడితే గ్రహాల ప్రభావం వల్ల మరుసటి రోజు నుంచే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అయితే ఇటువంటి వదంతుల్ని నమ్మవద్దని కొంతమంది నాస్తికవాదులు కొట్టిపారేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం మంచి చెడు దేవుడెరుగు.. మాట్లాడకుండా ఉంటే ఎటువంటి గొడవలు దరి చేరవని, ఒకరకంగా మౌనంగా ఉండడం కూడా ఆరోగ్యమేనని అంటున్నారు.
