జనసేన అధినేత, ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆత్మగౌరవ సభ పేరుతో రేపు కాకినాడలోని జేఎన్టీయూకే గ్రౌండ్లో సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు.
అయితే నిన్న చంద్రబాబు ప్రెస్ మీట్ ను ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇందులో చంద్రబాబు మాట్లాడుతు మొన్న పవన్ తో కూడా తిరుపతిలో గట్టిగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడించామని స్పష్టంగా పలికాడు.
కాకపోతే ఇక్కడ మనకు ఒక సినిమా గుర్తుకోస్తుంది. సినిమాలోకి (మున్నా) వెళ్తే ప్రకాష్ రాజ్ విలన్ గా ఉండి.. ఇంకోక్క విలన్ ని పెంచిపోషిస్తు ఉంటాడు. అదే తరహా లో ఇక్కడ ప్రతిపక్షాలకు ఎక్కడ మైలేజ్ వస్తుందోనని.. ముందుగానే పవన్ చేత ఈ వ్యవహరం నడిపిస్తున్నాడని అర్థమవుతుంది.
మనము ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి… కేంద్రం నిర్ణయించుకున్నాక పవన్ ఇప్పుడు మేలుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి..?
Related