- Advertisement -
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్ట్ సిరీస్లో భాగంగా రెండో టెస్ట్లో టీమిండియా ఓటమి అంచున నిలిచింది.287 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.పరుగులేమి చేయకుండానే ఓపెనర్ కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరాడు.జట్టు స్కోర్ 13పరుగుల వద్ద పూజార కూడా అవుట్ అవ్వడంతో టీమిండియా కష్టాల్లో పడింది.
17 పరుగులు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా అవుట్ అయ్యాడు.అదే బాటలో మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా అవుట్ అవ్వడంతో టీమిండియాను మరింత కష్టంలో నెట్టినట్లు అయింది.55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా.మరో రోజు ఆట మిగిలి ఉండటం,స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు లేకపోవడంతో ఇండియా ఓటమి దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
