Thursday, May 16, 2024
- Advertisement -

జింబాంబ్వేను క్లిన్ స్వీప్ చేసిన యువరక్తం

- Advertisement -

అనుకున్నదే. ఊహించినదే. భారత యువ ఆటగాళ్లు జింబాంబ్వే జట్టును కరువు తీరా ఓడించారు. మూడు వన్డేల సీరిస్ లో అన్ని మ్యాచ్ లు గెలుచుకుని సిరీస్ ను క్లీన్ స్వీప్ చేశారు. హరారేలో జరిగిన మూడో వన్డేలో జింబాంబ్వే ముందు బ్యాటింగ్ చేసి 123 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు, చహల్ రెండు వికెట్లు తీసి జింబాంబ్వే ఓటమిని శాసించారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఓపెనర్లు రాహుల్ 63 పరుగులు, ఫజల్ 55 పరుగులు చేసి  భారత్ కు సునాయాస విజయాన్ని అందించారు. జింబాంబ్వే టూర్ పుణ్యాన భారత్ లో యువ క్రీడాకారులకు కొదవలేదని మరోసారి రుజువైంది.

సీరిస్ మొత్తంలో కేవలం నలుగురు బ్యాట్స్ మెన్లకే బ్యాటింగ్ చేసే అవకాశం రావడం విశేషం. ఈ నెల 18, 20, 22 తేదిల మధ్య భారత్, జింబాంబ్వేల మధ్య ట్వంటీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్ లను శానటరివేర్ బ్రాండ్ ప్రయాగ్ స్పాన్సర్ చేస్తోంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -