పాకిస్థాన్తో పోరులో తడబడిన అఫ్గనిస్థాన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆరంభంలో అస్గర్ అఫ్గాన్(42: 35 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), ఆఖర్లో నజీబుల్లా జద్రాన్(42: 54 బంతుల్లో 6ఫోర్లు) రాణించడంతో 50 ఓవర్లలో అఫ్గాన్ 9 వికెట్లకు 227 పరుగులు చేసింది.
ఇదలా ఉంటె మ్యాచ్ సందర్భంగా పాక్, ఆప్ఘన్ ఆటగాళ్ల మధ్య ఘర్షనలు తలెత్తాయి. ఈ ఘర్షనల్లో ఇరు దేశాల అభిమానులు భీకరంగా కొట్టకున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.హెడింగ్లీ క్రికెట్ మైదానంలో గర్షన పడుతున్న ఇరు దేవాల అభిమానులను స్టేడియం బయటకు పంపించారు అక్కడున్న సిబ్బంది.
స్టే అయితే డియం వెలుపల భీకరంగా కొట్టుకున్నారు. సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న కొద్దిమంది జర్నలిస్టులపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ యాజర్ పోస్ట్ చేశాడు.పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్ మీద అఫ్ఘనిస్తాన్ అభిమానులు దాడి చేసినట్టు ఓ ట్విట్టర్ యూజర్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి మీద కొందరు యువకులు దాడి చేస్తున్నారు. బీభత్సంగా కొడుతున్నారు. వారి చేతిలో కొన్ని జెండాలు కూడా ఉన్నాయి. జెండాలు, కర్రలు, వాటర్ బాటిళ్లతో కొట్టుకున్నారు. వారిని కంట్రోల్ చేసేందుకు ఆ చుట్టుపక్కల ఉన్నవారు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.