- Advertisement -
అఫ్గానిస్తాన్తో ఇక్కడ జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆలౌటైంది.347/6 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో 127 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆటలో ఓవర్నైట్ ఆటగాడు అశ్విన్(7) ఆదిలోనే పెవిలియన్కు చేరగా, మరో ఓవర్నైట్ ఆటగాడు హార్దిక్ పాండ్యాతో కలిసి రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు.
ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ సాధించాడు. 83 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక చివర్లో ఇషాంత్ శర్మ(8)తో కలసి ఆఖరి వికెట్కు ఉమేశ్ యాదవ్ 34 పరుగులు జత చేశాడు. తొలి రోజు ఆటలో శిఖర్ ధావన్(107), మురళీ విజయ్(105), కేఎల్ రాహుల్(54)లు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.