Monday, May 20, 2024
- Advertisement -

ఏసీబీ విన్న‌పాన్ని సున్నితంగా తిర‌స్క‌రించిన బీసీసీఐ

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా టీ20 టోర్నీలకు ఉన్న క్రేజే వేరు. భారత్‌లో ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ లాగే పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌తో పాటు పలు దేశాలు టీ20 టోర్నీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రేజ్‌ను చూసే తాజాగా ఐసీసీ టీ20లు ఆడే 102 దేశాలకు అంతర్జాతీయ హోదా కల్పించింది.

అక్టోబర్ 5 నుంచి 24 వరకు షార్జా వేదికగా టీ20 లీగ్ నిర్వహించేందుకు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సన్నాహకాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు తమ టోర్నీలో ఆడేందుకు అనుమతించాలని బీసీసీఐను ఏసీబీ కోరింది. ఈ విన్నపాన్ని బీసీసీఐ సున్నితంగా తిరస్కరించింది.

తమ ఆటగాళ్లు ఐపీఎల్ లో తప్ప మరే ఇతర టీ20 లీగ్ లోనూ ఆడటం లేదని ఏసీబీకి బీసీసీఐ తెలిపింది. మీ లీగ్ లో ఆడేందుకు అనుమతిస్తే… ఇతర దేశాలు కూడా అడుగుతాయని… దానికి తాము సిద్ధంగా లేమని చెప్పింది. ఒక్క ఆటగాడిని అనుమతించినా… అందరినీ అనుమతించాల్సి వస్తుందని తెలిపింది. బీసీసీఐ కాంట్రాక్టులో లేని ఆటగాళ్లనైనా పంపాలని ఏసీబీ కోరగా… బీసీసీఐ దానికి కూడా అనుమతించలేదు. మీ లీగ్ కు ఆటగాళ్లను పంపకపోయినా… ఏసీబీకి తాము అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

ఐపీఎల్‌లో అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆటగాళ్లు రషీద్‌ఖాన్‌, మహమ్మద్‌ నబి, జహీర్‌ ఖాన్‌, ముజీబ్‌లు పలు ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -