ఎట్టకేలకు విరాట్ కోహ్లీ, అనుష్కశర్మలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మా పెళ్లి అయిపోయింది అంటూ విరాట్, అనుష్క అధికారికంగా ప్రకటిస్తూ ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేయగానే అభిమానులు, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే పెళ్లిఫోటోలను అమ్మకానికి పెట్టారు.
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విరుష్క జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటైంది. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సోమవారం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమాడాడు. ఇటలీలోని టస్కనీ రిసార్ట్లో ఈ పెళ్లి వేడుక జరిగింది. మనోర్ హౌజ్లోని నాలుగు విల్లాలను ఈ వేడుక కోసం ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. విరాట్, అనుష్క అధికారికంగా ప్రకటిస్తూ ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేయగానే అభిమానులు, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం జరుగగా, పరిమిత సంఖ్యలో మాత్రమే ఫోటోలను విడుదల చేసిన కొత్త జంట, ఎక్స్ క్లూజివ్ ఫోటోలను విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పుడు తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను అమెరికాకు చెందిన ఓ ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్కు అమ్మకానికి పెట్టారట.
ఫోటోలను విక్రయించడం ద్వారా వచ్చే డబ్బులను ఓ చారిటీ సంస్థకు ఇవ్వాలని వీరిద్దరూ నిర్ణయించారని సమాచారం. ఇక, పెళ్లివేళ, ఐదారు ఫోటోలు, నిమిషాల వీడియో మినహా విరాట్, కోహ్లీ వివాహం గురించిన సమాచారం వెల్లడి కాలేదన్న సంగతి తెలిసిందే.