Thursday, April 18, 2024
- Advertisement -

ప్రేమ వివాహ‌నికి రెడీ అయిన సైనా నెహ్వాల్ ..వ‌రుడు ఎవ‌రో తెలుసా?

- Advertisement -

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వివాహానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.అయితే ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతుంది.ఆమె ప్రేమించింది మ‌రెవ్వ‌రినో కాదు ఇండియ‌న్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్.గ‌త కొంత‌కాలంగా వీరిద్ద‌రి ప్రేమించుకుంటున్నారని వార్త‌లు వినిపించిన ,వాటిపై ఎవ‌రు స్పందించ‌లేదు.తాజాగా వీరిద్ద‌రు పెళ్లిపై ఇరు కుటుంబాలు అంగీకారం తెల‌ప‌డంతో ఈ ఏడాది చివ‌ర్లో వీరి పెళ్లి ఉంటుంద‌ని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

డిసెంబర్ 16న వీరి వివాహం .. 21న రిసెప్షన్ జరగనుంది. అలాగే పెళ్లి కేవలం వంద మంది సమక్షంలోనే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. బ్యాడ్మింటన్ క్రీడాకారులైన ఈ ఇద్దరు హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో 2005లో కలిశారు. కొన్ని సంవత్సరాలకు వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. అప్పటినుంచి దాదాపు పది సంవత్సరాలుగా ఈ ఇద్దరు ప్రేమలో కొనసాగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -