Monday, May 13, 2024
- Advertisement -

వెస్టీండీస్ బోర్డుపై ఆగ్రహం

- Advertisement -

మా క్రికెట్ బోర్డు దారుణం. మేం ట్వంటీ ప్రపంచ కప్ గెలిచినా మమ్మల్ని అభినందించలేదు. కనీసం ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. అని వెస్టీండీస్ ఆల్ రౌందర్ డ్వెన్ బ్రావో మండిపడ్డాడు. ఈ విషయంలో బిసిసిఐ తమ జట్టుకు ఎంతో సహకరించిందని భారత క్రికెట్ బోర్డును పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇంతకు ముందు కెప్టెన్ డారెన్ స్యామీ కూడా వెస్టీండీస్ బోర్డుపై విరుచుకుపడ్డాడు. బ్రావో అయితే వెస్టీండీస్ బోర్డు సరైన వ్యక్తుల చేతిలో లేదంటూ మండిపడ్డాడు. నిజానికి తాము ప్రపంచ కప్ గెలుస్తామని మా బోర్డు అనుకోలేదని, గెలవాలని కూడా కోరుకోలేదని వ్యాఖ్యానించాడు.

జీతాల విషయంలో బోర్డుకు. ఆటగాళ్లకు మధ్య గత కొంతకాలంగా విభేధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రావో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -