టీమిండియా జట్టు కొచ్తోపాటు, ఫిల్డింగ్, ఇతర సహాక సిబ్బంది నియామకానికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతోపాటు ప్రస్తుతం ఉన్న కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగియడంతో కొత్త కోచ్ వేటలో పడింది. హెడ్ కోచ్ రేసులో శ్రీలంక మాజీ ఆటగాడు మహేల జయవర్ధనె, టామ్ మూడి తదితరులు ఉన్నారు.
దక్షిణాఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ ఇప్పుడు భారత జట్టుకు శిక్షకుడిగా పని చేయాలని భావిస్తున్నాడు. బీసీసీఐకి కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 27న 50వ పుట్టినరోజు జరుపుకోబోతున్న రోడ్స్ తొమ్మిది సీజన్ల పాటు ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్కు ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించాడు. ఇదే అనుభవంతో ఇప్పుడు టీమిండియాకు ఫిల్డింగ్ కోచ్గా పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.