Saturday, May 18, 2024
- Advertisement -

జట్టులోకి వచ్చిన మురళీ, అశ్విన్, జడేజా…కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానే…

- Advertisement -

సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. నవంబరు 16 కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో తొలి టెస్టు జరగనుంది. శ్రీలంకతో జరిగే మొదటి రెండు టెస్టులకు 16 మంది సభ్యులలతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. గత కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నారు.

ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ సమయంలో మురళీ విజయ్‌కు గాయమైంది. శస్త్రచికిత్స కోసం యూకే వెళ్లిన విజయ్‌ ఐపీఎల్‌తో పాటు ఆ తర్వాత శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత మురళీ విజయ్‌ తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆడిన ఇషాంత్‌ శర్మకు జట్టులో చోటు దక్కింది.

జట్టు కెప్టెన్ గా కోహ్లీ వ్యవహరించనుండగా… వైస్ కెప్టెన్ గా రహానే కొనసాగనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు జట్టులోకి వచ్చారు. కుల్దీప్ యాదవ్ మూడో స్పిన్నర్ గా జట్టులో కొనసాగనున్నాడు.

భార‌త జ‌ట్టు వివ‌రాలు..

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌, ఛటేశ్వర పుజారా, రహానె(వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, మహమ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -