Thursday, May 2, 2024
- Advertisement -

బీసీసీఐపై ఫైర్ అయిన అనిల్ కూంబ్లే….

- Advertisement -

జోడు పదవుల వ్వవహారంపై బీసీసీఐ తీసుకున్న చర్యలను మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.విరుద్ధ ప్రయోజనాల కింద రెండు నెలల క్రితం దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లకి నోటీసులు పంపిన అంబుడ్స్‌మన్ ఇటీవల రాహుల్‌ ద్రవిడ్‌కి కూడా పంపాడు. ప్రస్తుతం ద్రవిడ్ ప్రస్తుతం భారత అండర్-19 క్రికెట్ జట్టు కోచ్‌‌గా, ఎన్‌సీఏ డైరెక్టర్‌‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. చెన్నై సూపర్ కింగ్స్‌ ఫ్రాంఛైజీ సంస్థ ఇండియా సిమెంట్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. దీంతో తాజాగా అనిల్ కూంబ్లే బీసీసీఐ నిర్ణయంపై మండిపడ్డారు.

అయితే ఇప్పటి వరకు ద్రవిడ్ స్పందించలేదు. ఇప్పటికే ద్రవిడ్ కు గంగూలి మద్దతు తెలుపగా గంగూలీ ఇప్పటికే గళం వినిపించగా.. తాజాగా ఆ మద్దతుదారుల జాబితాలో అనిల్ కుంబ్లే కూడా చేరాడు. భారత టెస్టు జట్టుకి నా అంచనా ప్రకారం ఓ 300 మంది ఆడి ఉంటారు. ఇందులో సగం మంది మాత్రమే ప్రస్తుతం జీవించి ఉన్నారు. వారు.. క్రికెట్‌కి తిరిగి ఏదైనా చేయాలనుకుంటున్నారు. కానీ.. ఇలా నోటీసులతో వారిని కూడా దూరం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ప్రతి ప్రొఫెషన్‌లోనూ విరుద్ధ ప్రయోజనాలు ఉంటాయన్న అనిల్ కుంబ్లే..కసారి తాము ఏ ఏ బాధ్యతల్లో ఉన్నామో..? బహిరంగపరిచిన తర్వాత ఇక విరుద్ధ ప్రయోజనాల అంశం ఎక్కడ ఉంటుంది..?’ అని కుంబ్లే ప్రశ్నించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -