Thursday, May 9, 2024
- Advertisement -

ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ ఎంవీ శ్రీధ‌ర్ గుండెపోటుతో మృతి..

- Advertisement -

ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఎంవీ శ్రీధ‌ర్ (51) హ‌ఠాణ్మ‌రం చెందురా. జు గుండెపోటుకు గురైన శ్రీధ‌ర్ ను హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గ‌తంలో హైద‌రాబాద్ రంజీ క్రికెట్ జట్టుకు ఆయ‌న‌ ప్రాతినిధ్యం వ‌హించారు. వైద్య వృత్తిని పూర్తి చేసిన ఎంవీ శ్రీధ‌ర్.. క్రికెట్ పైనే ఆస‌క్తిని చూపారు. హెచ్‌సీఏ కార్య‌ద‌ర్శిగా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆయ‌న‌కు భార్య‌, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.

గ‌తంలో హైద‌రాబాద్ రంజీ క్రికెట్ జట్టుకు ఆయ‌న‌ ప్రాతినిధ్యం వ‌హించారు. వైద్య వృత్తిని పూర్తి చేసిన ఎంవీ శ్రీధ‌ర్.. క్రికెట్ పైనే ఆస‌క్తిని చూపారు. హెచ్‌సీఏ కార్య‌ద‌ర్శిగా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆయ‌న‌కు భార్య‌, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.

భార‌త్‌లో 2016లో నిర్వ‌హించిన టీ20 వ‌రల్డ్ క‌ప్ టోర్న‌మెంట్‌ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.
2013లో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎన్‌.శ్రీనివాస‌న్ ఉన్న స‌మ‌యంలో ఎంవీ శ్రీధ‌ర్‌… బీసీసీఐ క్రికెట్ ఆప‌రేష‌న్స్ జీఎంగా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. భార‌త్‌ త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్ సిరీస్‌లు ఆడే మెన్‌, ఉమెన్‌, యూత్‌ క్రికెట్ టోర్న‌మెంట్ల షెడ్యూళ్ల‌ను ఖ‌రారు చేసే బాధ్య‌త‌ను కూడా నిర్వ‌ర్తించారు.

ఎంవీ శ్రీధ‌ర్ మృతిపై స్పందించిన బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్ ఎమ్మెస్కే ప్ర‌సాద్ మాట్లాడుతూ.. చాలా నిబ‌ద్ధ‌తతో ప‌నిచేసే వ్య‌క్తి ఎంవీ శ్రీధ‌ర్ అని, మంచి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తిని కోల్పోవ‌డం దురదృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు. శ్రీధర్ మృతదేహాన్ని జూబ్లిహిల్స్ లోని ఆయన ఇంటికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -