Tuesday, May 14, 2024
- Advertisement -

పెళ్లితో ఒక్క‌టైన అనుష్క‌,విరాట్ … ముంబ‌య్‌కి మ‌కాం మార్చ‌నున్న కొత్త జంట‌..

- Advertisement -

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ తార అనుష్క శర్మ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు, స్నేహితులు సమక్షంలో సోమవారం (డిసెంబర్ 11) ఈ ప్రేమ జంట ఒక్కటైంది. ఈ విషయాన్ని కోహ్లీ, అనుష్క తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అధికారికంగా వెల్లడించారు.

ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహానికి దుస్తులు డిజైన్‌ చేసిన ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ .. తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కోహ్లీ-అనుష్కల ఫోటోను షేర్‌ చేశాడు. అలాగే నూతన వధూవరులు…ఈ నెల 21న ఢిల్లీలో బంధువులకు, 26న ముంబైలో క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులకు రిసెన్షన్‌ ఏర్పాటు చేశారు.

అయితే ఇప్పుడు ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. కొత్త జంట ఎక్కడ కాపురం పెట్టబోతున్నారనేదే ఆ చర్చ. విరాట్ కోహ్లీ ఉండేది ఢిల్లీలో. అనుష్క ముంబైలో ఉంటుంది. బాలీవుడ్ లో నటీమణిగానే కాకుండా ప్రొడక్షన్ హౌస్ యజమానురాలిగా కూడా అనుష్క చాలా బిజీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, తన భార్య కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కోహ్లీ భావిస్తున్నాడు. దీంతో, ముంబైకి మకాం మార్చడానికి సిద్ధమయ్యాడు.

ముంబైలోని వర్లీలో ఈ కొత్త జంట కాపురం పెట్టబోతోందని సమాచారం. ఈ నెల 21 నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించబోతోంది. ఈ సందర్భంగా విరాట్ తో పాటు అనుష్క కూడా సౌతాఫ్రికా వెళ్లబోతోందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -