Sunday, May 19, 2024
- Advertisement -

త‌న‌కిష్ట‌మైన ఆహారానికి గుడ్‌బాయ్ చెప్పిన‌ కోహ్లీ…

- Advertisement -

టీమిండియా కెప్టెన్, పరుగుల సునామీ విరాట్ కోహ్లీ త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన ఆహారానికి గుడ్‌బాయ్ చెప్పాడు.ముక్క లేకపోతే ముద్ద కూడా తినని భారత సారథి… తన ప్రియతమ శ్రీమతి అనుష్క శర్మ ప్రభావంతో 100% వెజిటేరియన్‌గా మారిపోయాడు.నాలుగు నెలల క్రితమే కోహ్లీ మాంసాహారం మానేసి శాకాహారిగా మారిపోయాడని తెలిపారు. మాంసాహారం మానేసిన తర్వాతే కోహ్లీ మరింత దృఢంగా తయారయ్యాడని చెబుతున్నారు

అనుష్క సమేత విరాట్’ నాన్- వెజ్ తిని నాలుగు నెలలు అయ్యిందట. ఒకప్పుడు దమ్ బిర్యానీ ఇష్టంగా లాగించే విరాట్… ఇప్పుడు ప్రోటీన్ షేక్స్, ఆకుకూరలు, సోయా మాత్రమే తీసుకుంటున్నాడట. కొన్నాళ్ల నుంచి గుడ్లు, పాల ఉత్పత్తులు కూడా తినడం మానేశాడట కోహ్లీ.

మాంసాహారం తినడం మానేసిన తర్వాత మనోడి ఫిట్‌నెస్ మరింత మెరుగయ్యిందట. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో విరాట్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఫోర్లలతో బౌలర్లతో విరుచుకుపడే విరాట్… తన సెంచరీలో కొట్టింది కేవలం 10 ఫోర్లు మాత్రమే. అందులో సెంచరీ తర్వాత కొట్టినవే మూడు. 72 పరుగులను సింగిల్స్ ద్వారానే సాధించాడు. అంత ఫిట్‌నెస్‌కి కారణం వెజ్ ఫుడ్డే అంటే ఆశ్చర్యం కలగక మానదు. శారీరకంగానే కాదు… మానసికంగా కూడా మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా శాకాహారం చాలా సహకరిస్తోందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -