- Advertisement -
కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. తాజాగా మరో స్వర్ణాన్ని భారత ఖాతాలో వేశారు. పురుషుల 85 కేజీల విభాగంలో తెలుగబ్బాయి రాగాల వెంకట రాహుల్ మొత్తం 338 కేజీలు ఎత్తి అగ్రస్థానంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్లో 187 కేజీలు ఎత్తిన రాహుల్ స్నాచ్లో 151 కేజీలు లేపి స్వర్ణం దక్కించుకున్నాడు. రాహుల్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన వాడు.
తొలి రోజు మహిళల 48 కేజీల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను , రెండో రోజు 48 కేజీల విభాగంలో సంజిత చాను, శనివారం 77 కేజీల విభాగం పోటీల్లో సతీశ్ కుమార్ శివలింగంలు స్వర్ణం సాధించారు. ఇక పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజతం సాధించగా 69 కేజీల విభాగంలో 18 ఏళ్ల దీపక్ లాథర్ కాంస్యం సాధించడంతో భారత్కు మొత్తం ఆరు పతకాలు సొంతమయ్యాయి.