Saturday, May 11, 2024
- Advertisement -

ముంబ‌య్ త‌ల‌రాత మారేనా…వైఫ‌ల్యాల‌నుంచి పాఠాలు నేర్చుకుంటుందా..?

- Advertisement -

రెండుసార్లు ఐపీఎల్ విజేత ముంబ‌య్ ఇండియ‌న్స్‌కు ఈ ఐపీఎల్ 2018 సీజ‌న్‌లో మాత్రం గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటోంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన జ‌ట్టు పాయంట్ల ప‌ట్టిక‌లో చివ‌రిస్థానంలో నిలిచింది. ఇప్పటికే టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.

అయితే టీమ్‌లో విచిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. భారీ స్కోర్లు చేసినప్పుడు బౌలర్లు విఫలమై మ్యాచ్‌ని చేజార్చుతుండగా.. తక్కువ టార్గెట్ ముందు నిలిచినప్పుడు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేస్తుండటంతో ఆ జట్టు బాధ వర్ణాణాతీతం .

వరుస పరాజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉన్న ముంబయి జట్టు.. శనివారం రాత్రి 8 గంటలకి పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌‌ను పుణె వేదికగా ఢీకొట్టనుంది. ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై జట్టు ఓడింది ఒకదాంట్లో మాత్రమే.

ముంబయి ఓపెనర్లు ఎవిన్ లావిస్, సూర్యకుమార్ యాదవ్ జట్టుకి మెరుగైన ఆరంభాలు ఇస్తున్నా.. మిడిలార్డర్‌ అంచనాల్ని అందుకోలేకపోతోంది. ముఖ్యంగా.. హార్దిక్ పాండ్య, పొలార్డ్ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. బౌలింగ్‌ విభాగంలోనూ… స్పిన్నర్ మార్కండే మాత్రమే రాణిస్తున్నాడు. ముంబయి ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే.. ఇక ప్రతి మ్యాచ్‌లోనూ ఆ జట్టు సత్తాచాటాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -