ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానె ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీ ఆరంభంలో వరుసగా రెండు ఘన విజయాల్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. గత ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో అనూహ్యంగా 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
తమ అభిమాన జట్టు కొత్త వేదికపై ఎలా ఆడుతుందోనని చెన్నై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చెన్నైలోని చెపాక్ మైదానంలో అసాధారణ రికార్డు కలిగిన ధోనీసేన పుణె సొంత మైదానంగా లీగ్లోని మిగతా మ్యాచ్లను ఆడనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో పోరుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది.
పుణెలో ఆడుతున్న చెన్నై జట్టుని ప్రోత్సహించేందుకు తమిళనాడు నుంచి గురువారం ప్రత్యేక రైలులో 1,000 మంది అభిమానులు అక్కడికి వెళ్లారు. వారి ప్రయాణ ఖర్చులతో పాటు మ్యాచ్ పాస్, భోజన, వసతి సదుపాయాల్ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీనే సమకూర్చింది.