- Advertisement -
కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. భారత రెజ్లర్ రాహుల్ ఆవారే పసిడి పతకం సాధించారు. పురుషుల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించాడు రాహుల్. దీంతో గేమ్స్లో భారత్ ఇప్పటివరకూ సాధించిన పసిడి పతకాల సంఖ్య 13కు చేరింది. అంతకుముందు ఎనిమిదో రోజు పతకాల వేటను షూటర్ తేజస్వినీ సావంత్ రజతంతో ఆరంభించారు.
ఫైనల్లో కెనడాకు చెందిన స్టీవెన్ తకహషిపై 15-7 తేడాతో గెలిచాడు రాహుల్. మ్యాచ్ మొత్తాన్ని రాహుల్ డామినేట్ చేశాడు. తొలి పీరియడ్లో 6-4, రెండో పీరియడ్ తర్వాత 9-6తో లీడ్లో ఉన్న రాహుల్.. చివరి పీరియడ్లో మరింత చెలరేగి 15-7తో మ్యాచ్ గెలిచాడు. ఇండియాకు ఇది 13వ గోల్డ్ మెడల్. మొత్తంగా 27 పతకాలతో భారత్ మూడోస్థానంలో కొనసాగుతున్నది.