- Advertisement -
కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో పరాజయంపై జట్టు సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నారు. నిన్న (గురువారం)జరిగిన మ్యాచ్లో చెన్నైపై కేకేఆర్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో చెన్నైఫీల్డింగ్, బౌలింగ్లలో ఆటగాళ్లు విఫలం కావడంపై ధోని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. వాస్తవానికి ఏడో ఓవర్ వచ్చే సరికి క్రిస్ లిన్, రాబిన్ ఉతప్ప, సునీల్ నరైన్లను చెన్నై బౌలర్లు పెవిలియన్కు పంపారు.
ఆ తర్వాత వచ్చిన యువ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్, కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్లు జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.ఫీల్డింగ్లో చెన్నై చేసిన పొరబాట్లు కూడా ధోనికి కోపం తెప్పించాయి. ఉత్తమ ఫీల్డర్గా పేరున్న జడేజా వరుస బంతుల్లో సునీల్ నరైన్ క్యాచ్లను జార విడిచారు.