Sunday, April 28, 2024
- Advertisement -

టెస్టుల్లో ఓపెనింగ్‌కు నేను సిద్ధం…రోహిత్‌శ‌ర్మ‌

- Advertisement -

అవకాశం ఇస్తే టెస్టుల్లో ఓపెనింగ్ చేసేందుకు తాను సిద్ధమని ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. ఇంగ్లాండుతో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో టీం ఇండియా వరుసగా ఫెయిల్ అవుతున్న నేపధ్యంలో, జట్టు మేనేజ్‌మెంట్‌ ఆదేశిస్తే టెస్టుల్లో కూడా ఓపెనింగ్ చేస్తానని చెప్పాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ముగ్గురు ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ విఫలమవుతున్న నేపథ్యంలో అవకాశం ఇస్తే ఓపెనింగ్ చేస్తారా అన్న ప్రశ్నకు రోహిత్ పై సమాధానమిచ్చాడు.

టెస్టు ఓపెనింగ్ గురించి నాతో మేనేజ్‌మెంట్ చర్చించలేదు. అలాంటి అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. ఒకవేళ మేనేజ్‌మెంట్ ఆదేశిస్తే నేను రెడీ. నేను ఆట మొదలుపెట్టినప్పుడుగానీ, భారత్‌కు ఆడుతున్నప్పుడుగానీ వన్డేల్లో ఓపెనింగ్ చేస్తానని ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఏదో ఓ దశలో ఇది సాధ్యమైంది. కాబట్టి అవకాశం వస్తే టెస్టు ప్రత్యామ్నాయాలకు కూడా నేను సిద్ధంగా ఉన్నా అని రోహిత్ పేర్కొన్నాడు

టెస్టు క్రికెట్‌లో జట్టు మేనేజ్‌మెంట్‌ ఓపెనింగ్‌ చేయమంటే తానెప్పుడూ సిద్ధమేనని, టెస్ట్ లో రాణించటానికి నిరంతరం శిక్షణ పొందుతున్నానని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియాకు అండగా నిలబడాల్సిన సమయమిది అని చెప్పిన రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికాలోనూ తాము తొలి మ్యాచ్‌ ఓడిపోయినా తర్వాత రెండు మ్యాచుల్లోనూ రాణించామని, ఇంగ్లాండ్‌లోనూ టీమిండియా పుంజుకునే అవకాశాలున్నాయన్నాని చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -