వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై గృహహింస కేసులో భాగంగా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిన సంగతి తెలిసిందే.షమీ, అతని కుటుంబ సభ్యులు తనపై పలుమార్లు దాడి చేశారంటూ భార్య హసీన్ జహాన్ ఫిర్యాదు చేసింది. గృహహింస పిటిషన్పై విచారణ చేపట్టిన అలీపూర్ కోర్టు షమీతో పాటు ఆయన సోదరుడు హసీద్ అహ్మద్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ అరెస్ట్ వారెంట్ పై షమీ భార్య హసీన్ జహాన్ స్పందించారు.
తాను పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళను కాకపోయుంటే, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ సీఎం అవకపోయుంటే తాను ఇక్కడ సురక్షితంగా ఉండేదాన్ని కాదని వ్యాఖ్యానించారు.ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు అమ్రోహ పోలీసులు నన్నూ, నా కూతుర్ని వేధింపులకు గురిచేశారు. దేవుని దయవల్ల అక్కడ నుంచి క్షేమంగా బయటపడ్డాం’ అన్నారు.
న్యాయవ్యవస్థకు తాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, న్యాయం కోసం ఏడాదిగా పోరాడుతున్నానని తెలిపారు. షమీ ఓ పెద్ద క్రికెటర్ కావడంతో, తనను తాను చాలా శక్తిమంతుడ్నని భావిస్తుంటాడని హసీన్ జహాన్ వ్యాఖ్యానించారు.