Friday, May 17, 2024
- Advertisement -

భారత కోచ్ పదవికి నేడు ఇంటర్వ్యూ

- Advertisement -

భారత క్రికెట్ జట్టు కోచ్ కోసం మంగళవారం నాడు బిసిసిఐ ఇంటర్య్యూలను నిర్వహిస్తోంది. ఇన్నాళ్లూ ఎవరో ఒకర్ని తీసుకువచ్చి ఆ కుర్చీలో కూర్చోపెట్టిన బిసిసిఐ ఈసారి మాత్రం పక్కాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఈ పదివి కోసం ప్రముఖ క్రికెటర్లు రవిశాస్త్రి, సందీప్ పాటిల్, అనీల్ కుంబ్లె వంటి వారు పోటీ పడుతున్నారు. మొత్తం 21 మందిని తుది లిస్టుగా ఎంపిక చేసిన బోర్డు వారిని మంగళవారం నాడు ఓ హొటల్ లో ఇంటర్వ్యూ  చేయనుంది. బిసిసిఐ సలహా మండలి సభ్యులైన సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వి.వి.ఎస్.లక్ష్మణ్ ఈ దిగ్గజాలను ఇంటర్య్వూ చేయనున్నారు. లండన్ లో ఉన్న సచిన్ టెండూల్కర్ కోచ్ పదవి కోసం వచ్చిన వారిని వీడియో కాన్షరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారని బిసిసిఐ తెలిపింది. ఇంటర్య్వూ అయిత తర్వాత ఈ ముగ్గురి కమిటీ తన నిర్ణయాలను తెలియజేస్తూ బిసిసిఐ అధ్యక్షుడికి ఓ నివేదిక ఇస్తుంది. దీనిపై ఈ నెల 24న బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుని కోచ్ ను ఎంపిక చేస్తారు. వచ్చే నెలలో వెస్టీండీస్ టూర్ కు వెళ్లే జట్టుకు ఈ కోచ్ ను ఎంపిక చేస్తున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -