ప్రస్తుత ప్రపంచకప్ తర్వాత చాలా మంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నారు. ఇప్పటికే గేల్, షోయబ్ మాలిక్, అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. తాజాగా సౌతాఫ్రికానుంచి ఇద్దరు ఆటగాళ్లు గుడ్ బై చెప్పనున్నారు. సీనియర్ క్రికెటర్లు ఇమ్రాన్ తాహిర్, జేపీ డుమిని ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్కు వీడ్కోలు పలుకుతామని టోర్నీ ఆరంభానికి ముందే ప్రకటించారు.
చెత్త ప్రదర్శనతో లీగ్లోనె సఫారీలు ఇంటి బాట పట్టారు. వరల్డ్కప్లో భాగంగా శనివారం జరిగే తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సౌతాఫ్రికా.. నాకౌట్ చేరిన ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియాను ఓడించి ఇద్దరు ఆటగాళ్లకు ఘనంగా వీడ్కోలు పలకాలని డుప్లెసిస్సేన భావిస్తోంది. పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తాహిర్ 2011, 2015 ప్రపంచకప్లలో సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. స్పిన్ ఆల్రౌండర్ డుమిని దక్షిణాఫ్రికా తరఫున 2011, 2015 వరల్డ్కప్లలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు.