ఆస్ట్రేలియాతో ఆదివారం ముగిసిన మూడు టీ20ల సిరీస్ని 1-1తో సమం చేసిన భారత క్రికెటర్లు.. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లోనూ మెరుగైన స్థానాలను దక్కించుకున్నారు. ఈ ర్యాంకింగ్స్ లో భారత జట్టు నుండి కుల్దీప్ యాదవ్, శిఖర్ ధావన్ లు కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ లని సాధించారు.
టీ20 ర్యాంకింగ్స్లో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదో ర్యాంక్ని చేజిక్కించుకోగా.. శిఖర్ ధావన్ 11వ స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరికీ టీ20 కెరీర్లో ఇవే బెస్ట్ ర్యాంక్లు. ఇక ఆస్ట్రేలియాతో సిరీస్ని సమం చేసిన భారత్ జట్టు 127 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. పాకిస్థాన్ 138 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
కెప్టెన్ కోహ్లీ ర్యాంకింగ్ (14వ స్థానం)లో ఎలాంటి మార్పు లేదు. కాగా, ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంక్ లలో పాకిస్తాన్ కి చెందిన బ్యాట్స్ మెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉండగా, ఆఫ్ఘానిస్తాన్ కి చెందిన రషీద్ ఖాన్ బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే, ఆల్ రౌండర్ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్ వెల్ మొదటి స్థానంలో నిలిచాడు.