- Advertisement -
వెస్టిండీస్తో ఆంటిగ్వా వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో సత్తాచాటారు భారత క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, అజింక్య రహానె . విండీస్ పై భారత్ ఘనవిజయం సాధించింది. తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది.టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 7 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 10 పాయింట్లు పైకి ఎగబాకి ఏడో స్థానంలో నిలవగా.. రెండు ఇన్నింగ్స్ల్లో 81, 102 పరుగులు చేసిన రహానె కూడా 10 స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలిచాడు.
అంతకుముందు బుమ్రా అత్యుత్తమ టెస్టు ర్యాంకు 15 కాగా, ఆ తర్వాత ఒక స్థానం పడిపోయాడు.ఇక మ్యాచ్లో హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్లో తన నెం.1 స్థానాన్ని కాపాడుకున్నాడు.