ఆసీస్తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ల్లో భాగంగా తొలి రెండు టీ 20ల్లో విజయం సాధించింది టీమిండియా. రెండు టీ20ల్లోనూ భారీ స్కోరు చేయడంతో సూర్య కుమార్ సేన విజయం సాధించింది. ఇక ఇవాళ గౌహతి వేదికగా జరిగే మూడో టీ20లోనూ విజయం సాధిస్తే సిరీస్ మనదే అవుతుంది. అందవచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు యువ ఆటగాళ్లు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, రింకూసింగ్ భీకర ఫామ్లో ఉండటంతో భారత్ అలవొకగా 200 పరుగులు చేయగలుగుతోంది.
ఇక ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది ఆసీస్. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడింది ఆసీస్ జట్టు. మ్యాక్స్వెల్, స్మిత్, జంపా, స్టొయినిస్ లాంటి సీనియర్ క్రికెటర్లు ఉన్నా గెలవలేకపోతోంది. మరి ఈ మ్యాచ్లో ఎలాంటి వ్యూహంతో భారత్ను ఆసీస్ చిత్తు చేస్తుందో చూడాలి.
జట్ల అంచనా
భారత్:
యశస్వి, రుతురాజ్, ఇషాన్కిషన్, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్వర్మ, రింకూసింగ్, అక్షర్పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ముకేశ్ కుమార్
ఆస్ట్రేలియా:
స్మిత్, షార్ట్, ఇంగ్లిస్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, డేవిడ్, వేడ్(కెప్టెన్), జంపా, ఎలిస్, బెహెన్డార్ఫ్/అబాట్, తన్వీర్