Sunday, May 5, 2024
- Advertisement -

విండీస్‌తో టీ 20 సిరీస్‌కు భార‌త తొలి జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

- Advertisement -

వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆడే భారత జట్టును టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ ఇవాళ ప్రకటించింది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న టీ20 మ్యాచ్‌కు 12 మంది సభ్యుల బృందాన్ని ఎంపికచేసింది. ఆరుగురు బ్యాట్స్‌మెన్స్, ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లని ఈ జట్టులో చేర్చిన బీసీసీఐ.. రేపు తుది జట్టు ఎంపికని ఆసక్తికరంగా మార్చేసింది.

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడుతున్నప్పటికీ.. వరల్డ్‌కప్ సన్నాహాకంగా టీ20 సిరీస్‌ను ఉపయోగించుకుంటామని రోహిత్ పేర్కొన్నాడు.

12 మందిలో చోటుదక్కించుకున్న యువ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య తొలి టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తాడో చూడాలి. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు జట్టులో కృనాల్ చోటు దక్కించుకున్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.

తుది జట్టులో రేపు ఒకవేళ అదనపు బ్యాట్స్‌మెన్ కావాలనుకుంటే.. కృనాల్ పాండ్య‌ాని జట్టులోకి చేర్చి.. చాహల్‌పై వేటు వేసే అవకాశం ఉంది. అలాకాకుండా.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే.. మనీశ్ పాండే రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కావొచ్చు.

భారత జట్టుః
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, యుజువేంద్ర చాహల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -