- Advertisement -
ఆఫ్ఘానిస్తాన్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆఫ్ఘాన్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 159 పరుగులు చేసి విజయం సాధించింది. ఆల్రౌండర్ శివమ్ దూబే 40 బంతుల్లో2 సిక్స్లు,5 ఫోర్లతో 60 నాటౌట్గా నిలవగా జితేశ్ శర్మ (31), తిలక్ వర్మ (26), గిల్ (23) పరుగులు చేశారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 158 పరుగులు చేసింది. మహమ్మద్ నబీ (42), అజ్మతుల్లా (29), ఇబ్రహీం (25), రహ్మానుల్లా (23) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ 2 వికెట్లు పడగొట్టాడు. దూబేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆదివారం రెండో టీ20 జరగనుంది.