Monday, May 6, 2024
- Advertisement -

భార‌త్ vs ఆఫ్ఘ‌న్ టెస్ట్ : కోహ్లీ స్థానంలో టెస్ట్ కెప్టెన్‌గా అజింకా ర‌హానే….

- Advertisement -

అప్ఘాన్‌తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు అజింక్య రహానే భారత సారథిగా వ్యవహరించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంట‌నే భార‌త్ ఇంగ్లండ్ టూర్‌కు ప‌య‌న‌మ‌వుతుంది. అంత‌కు ముందే ఆఫ్ఘ‌న్‌తో బెంగళూరు వేదికగా జూన్ 14న ఏకైక టెస్ట్ ఆడ‌నుంది.

గ‌త టూర్‌లో ఇంగ్లాండ్ టూర్‌లో కెప్టెన్ కోహ్లీ పేవ‌ల మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించారు. అందుకే ఈసారి అలాంటి పేవ‌ల‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అక్క‌డి పిచ్‌ల‌ను అర్థం చేసుకొనేందుకు సర్రే తరఫున కౌంటీల్లో ఆడేందుకు కోహ్లి ఇంగ్లాండ్ వెళ్తుండటంతో అతడి స్థానంలో వెస్ కెప్టెన్ రహానే కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటాడనే వార్తలొస్తున్నాయి.

గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో రహానే తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. భుజం గాయం కారణంగా కోహ్లి దూరం కావడంతో.. ధర్మశాలలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌‌కు రహానే నాయకత్వం వహించాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టెస్టులకు అతణ్ని పక్కనబెట్టారు. రహానే బదులు రోహిత్‌కు అవకాశం కల్పించారు.

మూడో టెస్టులో జట్టులోకి వచ్చిన రహానే 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో భారత్ 63 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం యార్క్‌షైర్ తరఫున కౌంటీల్లో ఆడుతున్న ఛటేశ్వర్ పుజారా అప్ఘాన్‌తో టెస్ట్ కోసం భారత్ తిరిగి రానున్నాడు. కౌంటీల్లో ఆడుతున్న ఇషాంత్ శర్మ కూడా ఈ టెస్టులో ఆడే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -