- Advertisement -
ఆసిస్తో ఢిల్లీలో జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. ఓపెనర్ ఖవాజా (100) సెంచరీ, పీటర్ హ్యాండ్స్కాంబ్ (52) హాఫ్ సెంచరీతో రాణించినా.. మిడిలార్డర్ విఫలమవడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించలేక పోయింది.
బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (3/48), జడేజా (2/45), మహ్మద్ షమీ (2/57) సత్తాచాటగా.. జస్ప్రీత్ బుమ్రా (0/39) పొదుపు బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. నాలుగో వన్డేలో ఓంటిచేత్తో విజయం అందించిన టర్నర్ 20 పరుగులు మినహా మిగితా వారంతా విఫలం అవడంతో 273 పరుగులు చేసింది.