- Advertisement -
ఇంగ్లండ్తో జరిగిన మొదటి వన్డేలో ఘనవిజయం సాధించిన భారత్, రెండో వన్డేలో మాత్రం చేతులేత్తేసింది. లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో ఇండియా 82 పరుగుల తేడాలో ఓడిపోయింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. జో రూట్ సెంచరితో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయగలిగింది.
ఇక 323 పరుగు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మొదటి నుండి వరసగా వికెట్లు కోల్పొయింది. భారత్ సరిగ్గా 50 ఓవర్లలో 236 పరుగులే చేసి ఆలౌటైంది. కోహ్లి (45)రైనా (46) పరువు నిలిచే స్కోరు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లంకెట్కు 4 వికెట్లు దక్కాయి. రూట్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చివరి వన్డే 17న లీడ్స్లో జరగనుంది.